సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి.
సంఘమునకు వెలుపటి వారియెడల
“బయటి వారు” అనే పదబంధాన్ని గమనించండి. ఈ ఆలోచన I థెస్సలొనీకయులకు 4 12 లో వస్తుంది “సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువలేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక…” ఇది క్రీస్తును తెలియని వారికి మన సాక్ష్యం.
మరియు, 1 తిమోతి 3 7 లో “…సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను.”
ఎఫెసీయులకు 2:12-13, క్రైస్తవేతరులు “ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.౹ 13అయిననుమునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.”
నియమము:
తమ పాపమూలకు క్రీస్తు రక్తము విమోచన క్రయధానముగా విశ్వసించని వారు దేవునికి వెలుపల ఉన్నారు.
అన్వయము:
మీరు దేవునికి వెలుపల ఉన్నారా? లోపలికి ఎలా వెళ్ళాలో మీకు తెలుసా? మీరు మీ స్వనీతి జీవితంపై ఆధారపడి ఉంటే, మీరు దేవునికి వెలుపల నిలబడతారు.
సిలువపై యేసు చేసిన త్యాగం దేవునితో సహవాసముకు వెళ్ళడానికి ఏకైక మార్గం. మనం దేవునితో సవ్యంగా ఉండాలంటే మన పాపాలకు ఆయన మరణాన్ని విశ్వసించాలి. మనం ఇలా చేస్తే, దేవుడు మనలను తన పరలోకమునకు అనుమతిస్తాడు.
దేవునితో సత్సంబంధము కలిగి ఉండుటకు సారాంశం ఇక్కడ ఉంది
-మీరు దేవుని నీతి ప్రమాణానికి చేరువలోలేరని గుర్తించండి (రోమా. 3:10,23).
-మీ కోసం యేసు సిలువపై మరణించాడనే వాస్తవాన్ని మరియు నిత్యము మిమ్మల్ని నిత్యత్వములో క్షమించాడని విశ్వాసం ద్వారా అంగీకరించండి (రోమా. 4:5; 5:1).